Webdunia - Bharat's app for daily news and videos

Install App

16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (12:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలింది. ఆమె వయసు 45 యేళ్లు. ఈ బడ్డకు జన్మినిచ్చే సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్‌వర్‌ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్‌ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి.
 
పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు భార్య పలుమార్లు ప్రయత్నించింది. కానీ, భర్త అంగీకరించలేదు. దీంతో ఆ ఇల్లాలు జీవితమంతా పిల్లలుకంటూనే వచ్చింది. చివరకు తన 16వ బిడ్డకు జన్మనిస్తు ప్రాణాలు వదిలింది. 
 
దీనిపై మృతురాలి బిడ్డల్లో ఓ కుమార్తె స్పందిస్తూ, 'నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్‌ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్‌ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. 
 
కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది' అని సవిత తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments