16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలిన మహిళ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (12:23 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన ఒకటి జరిగింది. ఓ మహిళ తన 16వ బిడ్డకు జన్మనిస్తూ ప్రాణాలు వదిలింది. ఆమె వయసు 45 యేళ్లు. ఈ బడ్డకు జన్మినిచ్చే సమయంలో అధిక రక్తస్రావం కావడంతో ఆమె మరణించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన సుఖ్రాని అహిర్‌వర్‌ ఒక పేద కుటుంబానికి చెందిన మహిళ. చిన్న గుడిసెలో ఉంటుంది. ఆమె భర్త దుల్లాహ్‌ ఒక రైతు కూలీ. పని పోతే కానీ పూట గడవని పరిస్థితి.
 
పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు భార్య పలుమార్లు ప్రయత్నించింది. కానీ, భర్త అంగీకరించలేదు. దీంతో ఆ ఇల్లాలు జీవితమంతా పిల్లలుకంటూనే వచ్చింది. చివరకు తన 16వ బిడ్డకు జన్మనిస్తు ప్రాణాలు వదిలింది. 
 
దీనిపై మృతురాలి బిడ్డల్లో ఓ కుమార్తె స్పందిస్తూ, 'నేను చాలాసార్లు చెప్పాను ఆపరేషన్‌ చేయించుకోమని చెప్పాను. మా అత్తామామలకు తెలియకుండా ఆపరేషన్‌ చేయించుకోవడానికి నా పేరు నమోదు చేసుకున్నాను అని కూడా తెలిపాను. 
 
కానీ అమ్మ వినలేదు. వారం రోజుల క్రితం ఆమెను ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యలో అధిక రక్తస్రావం కావడంతో మరణించింది' అని సవిత తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments