Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి సీఎం జగన్ మద్దతు.. రాజకీయాలొద్దంటూ..?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (21:12 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ప్రధానిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరమూ అండగా ఉందామని ట్విట్టర్ వేదికగా జగన్ పిలుపునిచ్చారు.
 
కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని, కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ సూచించారు. 

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత సీఎం సోరెన్ ట్వీట్ చేశారు.
 
''ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేది.'' అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

తండేల్‌ ఫుటేజ్ కు అనుమతినిచ్చిన బన్సూరి స్వరాజ్‌కు ధన్యవాదాలు తెలిపిన బన్నీ వాసు

శ్వేతబసు ప్రసాద్... తాజా ఫోటో షూట్... ఎరుపు రంగు డ్రెస్సుతో అదిరింది

ఛావా దర్శకుడు ప్రతిసారీ కౌగిలించుకుంటుంటే తేడా అనుకున్నా: విక్కీ కౌశల్, రష్మిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments