Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని మోదీకి సీఎం జగన్ మద్దతు.. రాజకీయాలొద్దంటూ..?

Webdunia
శుక్రవారం, 7 మే 2021 (21:12 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. ప్రధానిపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా తప్పుబట్టారు. కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరమూ అండగా ఉందామని ట్విట్టర్ వేదికగా జగన్ పిలుపునిచ్చారు.
 
కేంద్రానికి సహకరించాల్సిన తరుణంలో వేలెత్తిచూపడం తగదని హితవు పలికారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో రాజకీయాలు చేస్తే దేశం బలహీనమవుతుందని పేర్కొన్నారు. సీఎం సోరెన్ అంటే తనకెంతో గౌరవమని, కరోనా సమయంలో రాజకీయాలు తగవని జగన్ సూచించారు. 

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా రాష్ట్ర పరిస్థితులను తెలుసుకోడానికి ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు కూడా ఫోన్ చేశారు. రాష్ట్ర పరిస్థితిపై ఆరా తీశారు. ఈ ఫోన్ కాల్ ముగిసిన తర్వాత సీఎం సోరెన్ ట్వీట్ చేశారు.
 
''ఈ రోజు ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు. కేవలం ఆయన మనసులోని మాటనే చెప్పారు. కట్టడికి ఏం చేయాలో చెబితే బాగుండేది. మా మాట కూడా వింటే బాగుండేది.'' అంటూ సోరెన్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments