కొరివి పెట్టిన తరువాత పాడె మీద నుంచి లేచిన శవం, పరుగులు తీశారు

Webdunia
బుధవారం, 16 అక్టోబరు 2019 (17:27 IST)
చనిపోయిన వ్యక్తి బతకడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి.. ఒడిస్సా రాష్ట్రం గంజా జిల్లా లావుగా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. కొరివి పెట్టే సమయంలో పాడె మీద నుంచి శవం పైకి లేవడంతో భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... మల్లిక్ మేకలను మేపేందుకు అడవికి వెళ్ళేవాడు. గత రెండు సంవత్సరాలుగా అతను ఇదే పని చేస్తున్నారు. అయితే గత నాలుగు రోజుల నుంచి తీవ్ర జ్వరంతో మల్లిక్ బాధపడ్డాడు. అయినా సరే అటవీ ప్రాంతంలోకి మేకలను తీసుకెళ్ళాడు. రాత్రివేళ అయ్యింది. సాయత్రం 6 గంటలకల్లా ప్రతిరోజు మల్లిక్ ఇంటికి వచ్చేసేవాడు. కానీ ఎంతకూ రాకపోవడంతో బంధువులు హైరానా పడి అటవీ ప్రాంతంలోకి వెళ్ళారు.
 
మల్లిక్ అటవీ ప్రాంతంలో ఓ చోట పడిపోయి ఉన్నాడు. శ్వాస వుందో లేదో అని పరిశీలించారు. అతడు శ్వాస తీసుకోవడంలేదు. దీంతో అతడు చనిపోయాడనుకున్నారు. బంధువులందరినీ పిలిచారు. పాడె సిద్ధం చేసి కుటుంబ సభ్యులందరూ స్మశాన వాటికకు తీసుకెళ్ళారు. కట్టెలు పెట్టి మల్లిక్‌ను పడుకోబెట్టి కొరివి పెట్టారు. అగ్గి పైకి లేవగానే దానితో పాటు మల్లిక్ కూడా పైకి లేచి కూర్చున్నాడు.
 
కిందకు దూకేశాడు. బంధువులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గ్రామస్తులైతే భయంతో పరుగులు తీశారు. విషయం అలా అలా బయటకు వెళ్ళడంతో మల్లిక్‌ను చూసేందుకు 45 గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments