Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్ పూర్వీకుల స్థిరాస్తుల వేలం.. కొనుగోలు చేసేదెవరు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (17:47 IST)
అండర్ వరల్డ్ డాన్, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు వేలం వేయనున్నారు. అంటే, దావూద్ తాత, అవ్వలకు సంబంధించిన స్థిరాస్తుల వేలం వచ్చే నెల పదో తేదీన వేలం వేయనున్నారు. 
 
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా కొంకణ్‌ గ్రామంలోని దావూద్‌ పూర్వీకులకు చెందిన ఏడు భూములను స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఫోర్ఫ్యూచర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్) (సఫెమా) కింద అధికారులు వేలం వేయనున్నారు. 
 
అంతేగాక దావూద్ చివరి సహాయకుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లు కూడా అదే రోజున వేలం వేయనున్నట్లు సమాచారం. అన్ని ఆస్తుల వేలం పాటను సఫెమా అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
ఈ ఆస్తులు కొనదలచిన వారు... వచ్చే నెల రెండో తేదీన ఈ ఆస్తులను స్వయంగా పరిశీలించవచ్చని అధికారులు చెప్పారు. ప్రతి ఆస్తి బిడ్డింగ్‌ కోసం దరఖాస్తుతో పాటు డిపాజిట్ డబ్బు నవంబర్ 6 సాయంత్రం 4 గంటలలోపు తమ కార్యాలయానికి అందాలని పేర్కొన్నారు. 
 
ఈ ఆస్తుల వేలం కోనం ఈ-వేలం, బహిరంగ వేలం, సీలు చేసిన టెండర్ల విధానాలను పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశం నుంచి పారిపోయిన దావూద్‌ పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబుతో నాన్ డిస్‌క్లోజ్ అగ్రిమెంట్ చేసుకున్న రాజమౌళి!!

రాత్రిపూట పిల్లలను సినిమాలకు అనుతించరాదు.. షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు!!

విశాల్ గురించి అలా అడగడం నాట్ కరెక్ట్.. వరలక్మి శరత్ కుమార్, అంజలి పైర్

అఖండ 2: తాండవం సెట్లో పద్మభూషణ్‌ నందమూరి బాలకృష్ణ కు సన్మానం

నిర్మాణంలోకి వీఎఫ్ఎక్స్ సంస్థ డెమీ గాడ్ క్రియేటివ్స్ - కిరణ్ అబ్బవరం లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

తర్వాతి కథనం
Show comments