దావూద్ పూర్వీకుల స్థిరాస్తుల వేలం.. కొనుగోలు చేసేదెవరు?

Webdunia
బుధవారం, 21 అక్టోబరు 2020 (17:47 IST)
అండర్ వరల్డ్ డాన్, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు వేలం వేయనున్నారు. అంటే, దావూద్ తాత, అవ్వలకు సంబంధించిన స్థిరాస్తుల వేలం వచ్చే నెల పదో తేదీన వేలం వేయనున్నారు. 
 
మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలూకా కొంకణ్‌ గ్రామంలోని దావూద్‌ పూర్వీకులకు చెందిన ఏడు భూములను స్మగ్లింగ్ అండ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఫోర్ఫ్యూచర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్) (సఫెమా) కింద అధికారులు వేలం వేయనున్నారు. 
 
అంతేగాక దావూద్ చివరి సహాయకుడు, గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చికి చెందిన రెండు ఫ్లాట్లు కూడా అదే రోజున వేలం వేయనున్నట్లు సమాచారం. అన్ని ఆస్తుల వేలం పాటను సఫెమా అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
ఈ ఆస్తులు కొనదలచిన వారు... వచ్చే నెల రెండో తేదీన ఈ ఆస్తులను స్వయంగా పరిశీలించవచ్చని అధికారులు చెప్పారు. ప్రతి ఆస్తి బిడ్డింగ్‌ కోసం దరఖాస్తుతో పాటు డిపాజిట్ డబ్బు నవంబర్ 6 సాయంత్రం 4 గంటలలోపు తమ కార్యాలయానికి అందాలని పేర్కొన్నారు. 
 
ఈ ఆస్తుల వేలం కోనం ఈ-వేలం, బహిరంగ వేలం, సీలు చేసిన టెండర్ల విధానాలను పాటిస్తామని సంబంధిత అధికారులు వెల్లడించారు. దేశం నుంచి పారిపోయిన దావూద్‌ పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments