Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దావూద్ ఇబ్రహీంకు కరోనా.. అండర్ వరల్డ్ డాన్ మృతి చెందాడా?

దావూద్ ఇబ్రహీంకు కరోనా.. అండర్ వరల్డ్ డాన్ మృతి చెందాడా?
, శనివారం, 6 జూన్ 2020 (17:58 IST)
గత 1993వ సంవత్సరం ముంబై బాంబు పేలుళ్లకు కారణమైన దావూద్ ఇబ్రహీంకు కరోనా పాజిటివ్ అని తేలింది. వందలాది మంది ప్రాణాలను బలిగొన్న 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ఇబ్రహీం ప్రధాని నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దాదాపు 25 ఏళ్ల నుంచి బయటి ప్రపంచానికి కనిపించకుండా రహస్య ప్రదేశాల్లో తలదాచుకుంటున్నాడు.
 
ఈ నేపథ్యంలో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే దావూద్ సతీమణి షెరీన్‌కు కూడా కరోనా పాజిటివ్‌ను ధ్రువీకరించిన తరుణంలో.. వారి ఇంట్లో పని మనిషులను క్వారంటైన్‌లో వుంచినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు మోస్ట్‌ వాటెండ్‌ అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం కరోనా వైరస్‌తో మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్నాయి. మిలిటరీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి ఆయన మృతి చెందాడని పాకిస్తాన్‌కు చెందిన న్యూస్‌ ఎక్స్‌ మీడియా సంస్థ శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. వైరస్‌ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్‌ మృతి చెందాడని పేర్కొంది. 
 
ఈ వార్త కాస్తా సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌‌ అవుతోంది.  దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విపరీతంగా కామెంట్స్‌ పెడుతున్నారు. భారత్‌తో సహా ప్రపంచ దేశాలు చేయలేని పనిని కరోనా వైరస్‌ చేసిందని వ్యంగ్యంగా పోస్ట్‌ చేస్తున్నారు. అయితే దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం మాత్రం సోదరుడు మరణవార్తల్లో నిజం లేదని కొట్టిపారేస్తున్నాడు. దావూద్ ఫ్యామిలీ సేఫ్‌గా వుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంటలిజెన్స్ వర్గాలు మాత్రం దావూద్ కోవిడ్ సోకడంతో క్వారంటైన్‌లో వున్నారని చెప్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దివ్య అందంతోనే వారి వ్యాపారం, తేడా వచ్చిందని గుండు కొట్టి దారుణంగా..?