Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేతనం అడిగాడనీ ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యజమాని..

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (09:07 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కంపెనీ యజమాని ఐదు నెలలుగా వేతనం ఇవ్వడంలేదు. దీంతో ఆ ఉద్యోగికి బతుకు భారమైంది. అందువల్ల తనకు వేతనం ఇవ్వాలని యజమానివద్ద మొరపెట్టుకున్నాడు. కానీ, ఆ యజమాని మాత్రం ఆగ్రహంతో ఊగిపోయాడు. అంతటితో శాంతించని ఆయన.. వేతనం అడిగిన ఉద్యోగిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రం, అల్వార్ నగరంలోని ఖైర్ థాల్ ప్రాంతంలో ఓ వ్యక్తికి మద్యం షాపు ఉంది. ఇందులో కమల్ కిషోర్ (22) అనే వ్యక్తి సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. అయితే, కరోనా లాక్డౌన్ కారణం చూపి.. ఐదు నెలలు పనిచేసినా యజమాని జీతం ఇవ్వలేదు. దీంతో తనకు వేతనం ఇవ్వాలని యజమానిని కమలేశ్ నిలదీశాడు. 
 
దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మద్యం దుకాణ యజమాని... కమల్ కిషోర్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. శరీరానికి మంటలు అంటుకోవడంతో తనను తాను రక్షించుకునేందుకు కమల్ కిషోర్ దుకాణంలో ఉన్న డీప్ ఫ్రీజర్‌లోకి వెళ్లాడు. అప్పటికే శరీరంలో అధికభాగం కాలిపోవడంతో కిషోర్ కిషోర్ మృతి చెందాడు. 
 
కాగా, కమల్ కిషోర్ దళితుడు కావడంతో ఈ ఘటనపై రాజస్థాన్ దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. అధికార పక్షంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments