Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వచ్చిన కప్ప.. చంపి పులుసు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (18:01 IST)
తమ ఇంట్లోకి ఓ కప్ప రావడాన్ని ఆ కుటుంబ యజమాని జీర్ణించుకోలేకపోయాడు. దీన్ని పట్టుకున్న ఆయన చంపేసి ఏకంగా పులుసు పెట్టేసాడు. ఆ కప్ప కూరను ఆరగించిన ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని జోడా బ్లాక్‌కు చెందిన మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి ఓ కప్పవచ్చింది. దీన్ని చూడగానే మున్నాకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో ఆ కప్పను ఆయన చంపేసి, కూర వండాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలకు వడ్డించాడు. ఈ కూరను ఆరగించే ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడగా మరో చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈమె ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. 
 
ఈ వార్త తెలుసుకున్న పోలీసులు కియోంజర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని బమేబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుదా అనే గ్రామానికి వెళ్లి విచారించగా, 40 యేళ్ల గిరిజన తెగకు చెందిన మున్నా అనే వ్యక్తి ఈ పాడు పనికి పాల్పడిన మాట వాస్తవమేనని తేలింది. 
 
కాగా, బాలిక మృతి అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు బామేబేరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ స్వరూప్ రంజన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అజిత్ కుమార్.. విడాముయ‌ర్చి ఫ‌స్ట్ లుక్ - ఆగ‌స్ట్ లో చిత్రీక‌ర‌ణ‌ పూర్తి

దేవుడి దయ. సినిమా అద్భుతమైన విజయం సాధించింది : సి. అశ్వనీదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments