Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లిలో దారుణం : మద్యంమత్తులో అంధురాలైన యువతి నరికివేత

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (17:11 IST)
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో అంధురాలైన ఓ యువతిని ఓ కిరాతకుడు అతి దారుణంగా నరికివేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై అదే ప్రాంతానికి చెందిన రాజు అనే దుండగుడు కత్తితో దాడి చేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట ప్రాంతానికి చెందిన రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో ఆదివారం రాత్రి ఒంటరిగా ఉన్న యువతి ఇంటికి వెళ్లి, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు కలిసి రాజును మందలించడంతో కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి యువతిపై కత్తితో దాడి చేసి నరికివేశాడు. ఆ తర్వాత దండగుడు నేరుగా డీఎస్పీ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నా పోలీసులు మాత్రం చూసీచూడనట్టుగా వదిలివేసి, చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments