Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లోకి వచ్చిన కప్ప.. చంపి పులుసు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (18:01 IST)
తమ ఇంట్లోకి ఓ కప్ప రావడాన్ని ఆ కుటుంబ యజమాని జీర్ణించుకోలేకపోయాడు. దీన్ని పట్టుకున్న ఆయన చంపేసి ఏకంగా పులుసు పెట్టేసాడు. ఆ కప్ప కూరను ఆరగించిన ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాదకర ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని జోడా బ్లాక్‌కు చెందిన మున్నా అనే వ్యక్తి ఇంట్లోకి ఓ కప్పవచ్చింది. దీన్ని చూడగానే మున్నాకు పట్టరాని కోపం వచ్చింది. దీంతో ఆ కప్పను ఆయన చంపేసి, కూర వండాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలకు వడ్డించాడు. ఈ కూరను ఆరగించే ఆరేళ్ల చిన్నారి మృత్యువాతపడగా మరో చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈమె ఆరోగ్యం కూడా విషమంగా ఉంది. 
 
ఈ వార్త తెలుసుకున్న పోలీసులు కియోంజర్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని బమేబారి పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుదా అనే గ్రామానికి వెళ్లి విచారించగా, 40 యేళ్ల గిరిజన తెగకు చెందిన మున్నా అనే వ్యక్తి ఈ పాడు పనికి పాల్పడిన మాట వాస్తవమేనని తేలింది. 
 
కాగా, బాలిక మృతి అసహజ మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్టు బామేబేరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ స్వరూప్ రంజన్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments