Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో రూ.27 కోట్ల విలువ చేసే చేతి గడియారం స్వాధీనం

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2022 (11:26 IST)
Rolex watches
ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి న్యూఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.27 కోట్ల విలువైన చేతి గడియారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆ విమాన ప్రయాణికుడిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
 
గురువారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నుండి న్యూఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఓ ప్రయాణికుడి బ్యాగ్‌లో అక్రమంగా తరలిస్తున్న ఏడు లగ్జరీ వాచీలు, డైమండ్ 'బ్రాస్‌లెట్', 'ఐ-ఫోన్ 14 ప్రో మొబైల్ ఫోన్'లు ఉన్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 'పియాజెట్ లైమ్‌లైట్ స్టెల్లా', ఐదు 'రోలెక్స్' వాచీలు ఉన్నాయి. 
 
రూ.31 లక్షల విలువైన పియాజెట్ వాచీలు, రూ.15 లక్షల విలువైన రోలెక్స్ వాచీలు.. ఇవికాకుండా అమెరికాకు చెందిన ప్రముఖ బంగారు ఆభరణాలు, వాచ్ డిజైన్ కంపెనీ 'జాకబ్ అండ్ కంపెనీ' తయారు చేసిన స్విస్‌లో తయారు చేసిన 'బిలియనీర్ 3 పాకెట్' అత్యంత ఖరీదైన వాచీల్లో ఒకటి. 
 
దీని విలువ ధర 27 కోట్ల రూపాయలు. 18 క్యారెట్ వైట్ గోల్డ్‌తో తయారు చేయబడిన ఈ వాచ్‌లో 76 వజ్రాలు ఉన్నాయి. ఇంత ఖరీదైన గడియారం ఇంతకాలం పట్టుబడలేదని విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments