Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం ఎంత పనిచేశాడు.. సరిహద్దు దాటి పెళ్లి చేసుకున్నాడు..

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (10:08 IST)
ప్రేమ కోసం ఏమైనా చేసే యువకులు ఏమైనా చేస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఓ యువకుడు ప్రేమించిన యువతి కోసం సరిహద్దు దాటాడు. పొరుగు దేశం యువతిని పెళ్ళాడి స్వదేశం వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. 
 
ఈ ఘటన పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని నదియా జిల్లా బల్లావ్ పూర్ చెందిన జైకాంతో చంద్రరాయ్ (24) అనే యువకుడికి బంగ్లాదేశ్ కు చెందిన పరిణీతి (18) అనే యువతితో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
 
ఈ నేపథ్యంలోనే ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అక్రమ మార్గంలో మార్చి 8 తేదీన చంద్రరాయ్ బంగ్లాదేశ్ వెళ్ళాడు. మార్చి 10 తేదీన పరిణీతిని పెళ్లి చేసుకున్నాడు. జూన్ 25 తేదీ వరకు అక్కడే ఉన్నాడు. 
 
జూన్ 26 తేదీ భార్య పరిణీతితో కలిసి బోర్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వారిని బీఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరినీ విచారించడంతో పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు గట్టిగా నిలదీశారు. దీంతో చంద్రరాయ్ జరిగిన విషయం తెలిపాడు.
 
ఇక సరిహద్దు దాటించేందుకు ఓ వ్యక్తి తమ వద్ద 10000 బంగ్లాదేశీ టకాలు తీసుకున్నాడని తెలిపారు. కాగా వీరిని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు.. తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments