Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (13:30 IST)
కరోనా లాంటి వ్యాధులు వస్తున్నా మానవ వేషంలో వున్న మృగాలు అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. మొన్నటికి మొన్న ఏనుగుకు పటాస్‌లతో చంపేసిన ఘటన మరవకముందే.. నేడు ఆవులకు విషం పెట్టి చంపేశారు. అదీ అరటి పండ్లలో విషం పెట్టి.. గోవులను హతమార్చారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో 20 ఆవులకు విషం పెట్టారు. దాంతో ఆవులు అక్కడే మృతి చెందాయి. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్ సమీప గ్రామాల్లోని ఆవులు మేత మేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి. దాంతో కాఫీతోటలో దూరి ఆకులను తింటాయని మేనేజర్, సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారు. 
 
మృతిచెందిన తర్వాత ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఆలా ఇప్పటివరకు మొత్తం 20 ఆవులను చంపి పూడ్చిపెట్టారు. ఆవులు మాయమౌతుండటంతో గ్రామస్థులు ఎస్టేట్ వద్ద గాలిస్తుండగా కళేబరాలు కనిపించాయి. దాంతో విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments