Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (13:30 IST)
కరోనా లాంటి వ్యాధులు వస్తున్నా మానవ వేషంలో వున్న మృగాలు అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. మొన్నటికి మొన్న ఏనుగుకు పటాస్‌లతో చంపేసిన ఘటన మరవకముందే.. నేడు ఆవులకు విషం పెట్టి చంపేశారు. అదీ అరటి పండ్లలో విషం పెట్టి.. గోవులను హతమార్చారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో 20 ఆవులకు విషం పెట్టారు. దాంతో ఆవులు అక్కడే మృతి చెందాయి. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్ సమీప గ్రామాల్లోని ఆవులు మేత మేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి. దాంతో కాఫీతోటలో దూరి ఆకులను తింటాయని మేనేజర్, సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారు. 
 
మృతిచెందిన తర్వాత ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఆలా ఇప్పటివరకు మొత్తం 20 ఆవులను చంపి పూడ్చిపెట్టారు. ఆవులు మాయమౌతుండటంతో గ్రామస్థులు ఎస్టేట్ వద్ద గాలిస్తుండగా కళేబరాలు కనిపించాయి. దాంతో విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కేరళలో తెరకెక్కిన ‘నరుడి బ్రతుకు నటన గ్లింప్స్ విడుదల

స్నేహ ఉల్లాల్ ప్రధాన పాత్రలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ భవనమ్ సిద్ధం

తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న డిజిటల్ క్రియేటర్‌కు అశోక్ గల్లా సహాయం

ప్రజాస్వామ్యం తరహాలో ప్రేక్షకులు ద్యారా వర్మ చేస్తున్న యువర్ ఫిల్మ్ ఐడియా

బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ ప్రధాన పాత్రలో మిస్ జానకి చిత్రం

వేసవి తాపం నుంచి కాపాడే 6 హెర్బల్ పానీయాలు

మామిడి గింజలులో దాగున్న ఆరోగ్య రహస్యాలు, ఏంటవి?

వేసవిలో దూరం పెట్టాల్సిన 5 స్పైసీ ఫుడ్స్, ఏంటవి?

బాదంపప్పుల చక్కదనంతో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోండి

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2024: ఆరోగ్యంగా వుండేందుకు సూత్రాలు

తర్వాతి కథనం
Show comments