Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (13:30 IST)
కరోనా లాంటి వ్యాధులు వస్తున్నా మానవ వేషంలో వున్న మృగాలు అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. మొన్నటికి మొన్న ఏనుగుకు పటాస్‌లతో చంపేసిన ఘటన మరవకముందే.. నేడు ఆవులకు విషం పెట్టి చంపేశారు. అదీ అరటి పండ్లలో విషం పెట్టి.. గోవులను హతమార్చారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో 20 ఆవులకు విషం పెట్టారు. దాంతో ఆవులు అక్కడే మృతి చెందాయి. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్ సమీప గ్రామాల్లోని ఆవులు మేత మేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి. దాంతో కాఫీతోటలో దూరి ఆకులను తింటాయని మేనేజర్, సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారు. 
 
మృతిచెందిన తర్వాత ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఆలా ఇప్పటివరకు మొత్తం 20 ఆవులను చంపి పూడ్చిపెట్టారు. ఆవులు మాయమౌతుండటంతో గ్రామస్థులు ఎస్టేట్ వద్ద గాలిస్తుండగా కళేబరాలు కనిపించాయి. దాంతో విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో నిహారిక కొణిదల రెండోవ సినిమా

Sunitha Williams: సునీతా విలియమ్స్ కు నిజమైన బ్లూ బ్లాక్ బస్టర్ : మెగాస్టార్ చిరంజీవి

Mohanlal: ఐమ్యాక్స్‌లో విడుద‌ల‌వుతున్న తొలి సినిమా L2E: ఎంపురాన్‌ : మోహ‌న్ లాల్‌

Chiranjeevi : చిరంజీవి బుగ్గపై ముద్దు పెట్టుకున్న మహిళా అభిమాని- ఫోటో వైరల్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments