Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భస్థ శిశువును కూడా వదిలిపెట్టని కరోనా మహమ్మారి..

Webdunia
శనివారం, 17 ఏప్రియల్ 2021 (15:51 IST)
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కడుపులో వున్న గర్భస్థ శిశువును కూడా కరోనా వదల్లేదు. తల్లి నుండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా కరోనా మహమ్మారి సోకింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. ఇప్పటిదాకా తల్లి కడుపులోని బిడ్డకు కరోనా సోకదని చాలా మంది నిపుణులు చెప్తూ వున్నారు. తాజాగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడంతో నిపుణులు కూడా షాక్ అవుతూ ఉన్నారు.
 
కరోనా పాజిటివ్ ఉన్న ఓ మహిళ కరోనా పాజిటివ్ ఉన్న బిడ్డకు జన్మనిచ్చింది. తొలుత ఆమె భర్తకు కరోనా పాజిటివ్ రాగా.. ఆయన ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెకూ పాజిటివ్ వచ్చింది. ఈ క్రమంలోనే పురిటి నొప్పులు రావడంతో పలు ఆసుపత్రులకు తిరిగారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు ఆమెను చేర్చుకునేందుకు అంగీకరించలేదు.
 
ఆయుష్మాన్ భవ్ ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకుని ప్రసవం చేసింది. తర్వాత పుట్టిన బిడ్డకూ కరోనా ఉన్నట్టు గుర్తించి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. డాక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం చాలా అరుదు అని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలను పాటించాల్సిందేనని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

తర్వాతి కథనం
Show comments