Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా దవాఖాన కిటికీ నుంచి దూకేసిన మహిళ.. ఎక్కడ?

Webdunia
గురువారం, 20 ఆగస్టు 2020 (12:39 IST)
కరోనాతో ప్రాణాలు కోల్పోయే వారు భారీగానే వున్నారు. కానీ కోవిడ్ సోకిందనే భయంతో, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడేవారు కూడా పెరిగిపోతున్నారు. చాలామంది చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కానీ మరి కొందరు కరోనా వచ్చాక డీలా పడిపోతున్నారు. తాజాగా కరోనాతో చికిత్స పొందుతున్న మహిళ దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా తీర్థంకర్ మహావీర్ మెడికల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే... కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారించబడిన మహిళను ఇటీవల వైద్య అధికారులు టీఎంఎంయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. గురువారం ఉదయం ఉన్నట్టుండి ఆమె దవాఖాన కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
 
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. మహిళ కిటికీలో నుంచి దూకిన దృశ్యాలు వార్డులోని సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియోను భద్రపరిచామని, కేసు నమోదు చేసి ఆత్మహత్య గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments