Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్- మాస్కుల్లేవ్, సోషల్ డిస్టన్స్ లేదు..

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:59 IST)
కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అయితే కర్నాటకలోని రామనగర జిల్లాల్లో జాతర జరుగుతోంది. కొలగండనహల్లి గ్రామంలో గుడి వద్ద జాతరను నిర్వహించారు. మాస్కులు లేకుండా, సామాజిక దూరం పాటించకుండా... ఊరి జాతరలో వేలాది మంది పాల్గొన్నారు. 
 
ఊరంతా గుంపుల గుంపులుగా అమ్మ వారి ఆలయానికి వెళ్లారు. మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత పూజలు చేసి.. నైవేద్యం సమర్పించి.. అనంతరం ప్రత్యేక కార్యక్ర్రమాలు కూడా నిర్వహించారు. 
 
ఇంత జరుగుతున్నప్పటికీ ఏ అధికారీ పట్టించుకోలేదు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి అనుమతి ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ క్రమంలో తహశీల్దార్ ఆదేశాల మేరకు విలేజ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ను రామనగర డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేశారు. మరోవైపు కర్ణాటకలో కరోనా కేసులు వెయ్యి దాటాయి. కొత్తగా 69 కేసులు నమోదైనాయి. బెంగళూరు, మండ్యాల్లో 13 కేసులు నమోదైనాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments