Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఘోరం... స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సూసైడ్

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (18:57 IST)
విశాఖలో ఘోరం జరిగింది. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా కృష్ణవర్మ పని చేస్తున్నారు. ఈయన గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నట్టు సమాచారం. 
 
ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరంగా మరింత అస్వస్థతకు లోనయ్యారు. దీంతో విశాఖ బీచ్‌కు వెళ్లిన కృష్ణవర్మ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు ఆయన భార్య ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్ స్టేషన్ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ, కృష్ణ వర్మ కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, శుక్రవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆయన భార్య ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. 
 
వర్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించామని అన్నారు. కాగా, అనారోగ్య కారణాలతో కృష్ణ వర్మ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ఆయనకు గుండె ఆపరేషన్ అయినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments