Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబై మురికి వాడ పరిశుభ్రం.. అయినా 33 కరోనా కేసులు

ముంబై మురికి వాడ పరిశుభ్రం.. అయినా 33 కరోనా కేసులు
, గురువారం, 14 మే 2020 (18:57 IST)
ధారావిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా ధారావిలో మరో 33 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనాయి. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ధారవిలో కరోనా మహమ్మారి గత నెల మొదటి వారంలో 10 కేసులతో మొదలై ఆ తర్వాత వేగంగా విస్తరించింది. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
ముంబై మురికి వాడను పూర్తిగా పరిశుభ్రం చేశారు. అన్ని ఇళ్లలో శానిటైజింగ్ నిర్వహించారు. బాధితులను గుర్తించి క్వారెంటైన్‌కు తరలించారు. అధికారులు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. గురువారం నమోదైన 33 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. కాగా, గురువారం ధారావిలో కొత్తగా రెండు మరణాలు కూడా సంభవించాయి.
 
మరోవైపు కరోనా వేగంతో దేశంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి‌. కొన్ని రోజులుగా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. టెస్టింగ్‌ సామర్థం పెరగడంతో పాటు వైరస్‌ సోకే వారి సంఖ్య కూడా పెరిగింది. వలస కార్మికుల రాకతో రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయి‌.
 
దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3వేల 722 కొత్త కేసులు నమోదయ్యాయి‌. 134 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78 వేల మార్కుకు చేరింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది, ధర ఎంతో తెలుసా?