సోదరి చితిపై దూకిన యువకుడు - గాల్లో కలిసిపోయిన ప్రాణాలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (12:01 IST)
వరుసకు సోదరి అయిన యువతి చితిపై దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగరి జిల్లాలోని బహెరియా పోలీస్‌ స్టేషన్‌ పరిధి మఝ్‌గువా గ్రామంలో 21 ఏళ్ల యువతి పొలం నుంచి కూరగాయలు తెచ్చుకునేందుకు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లింది. అయితే, ఆమె ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలంలోకి వెళ్లారు. 
 
అక్కడ పొలం బావిలో పడిపోయి ఉంటుందేమో అన్న అనుమానంతో చూడగా అందులో ఆమె మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమెకు వరుసకు సోదరుడయ్యే కరణ్‌(18) 430 కి.మీ. దూరంలో ఉండే ధర్ నుంచి మోటారు బైకుపై గ్రామానికి చేరుకున్నాడు. 
 
శుక్రవారం సాయంత్రం సోదరి అంత్యక్రియలు జరుగుతుండగా పట్టరాని దుఃఖంతో ఒక్కసారిగా చితిమంటల్లోకి దూకాడు. దీన్ని గమనించిన బంధువులు అతణ్ని మంటల్లోంచి బయటకు లాగారు. అప్పటికే అతడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి దారిలోనే చనిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments