Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త రికార్డు.. మహారాష్ట్రలో డేంజర్ బెల్స్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:49 IST)
దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,65,021 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...53,476 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 251 నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు 1,17,87,534 కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో 1,12,31,650 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,95,192 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,60,692కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,490 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
మరోవైపు మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇలానే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వరకూ మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
అత్యధికంగా పుణె జిల్లాలో (61,125), తర్వాత నాగ్‌పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వచ్చే 11 రోజుల్లో మరణాల సంఖ్య కూడా 64 వేలు దాటనుందని అంచనా. ప్రస్తతం ప్రతి వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments