Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాసు హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా!

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (10:04 IST)
తమిళనాడు ను వణికిస్తున్న కరోనా మద్రాస్ హైకోర్టు తలుపునూ తట్టింది. మద్రాసు హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో హైకోర్టును మూసివేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణను చేసేందుకు ప్రత్యేక బెంచ్‌ లను ఏర్పాటు చేశారు. కాగా, లాక్‌ డౌన్‌ సమయంలో కోర్టును మూసివేసిన అనంతరం జూన్‌ 1 నుండి కోర్టులో విచారణలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముగ్గురు జడ్జీలకు కరోనా సోకడంతో.. వారికి సన్నిహితంగా ఉన్న వారికి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

హైకోర్టు న్యాయమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో కలిసి సమావేశమై, హైకోర్టుకు తాళం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ రావద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల నిమిత్తం ఓ ప్రత్యేక బెంచ్‌ ని ఏర్పాటు చేసి, వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారణలు చేపట్టాలని చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారు.

కాగా, స్థలాన్ని హైకోర్టు నిమిత్తం అప్పగించిన యజమాని విధించిన నిబంధన నిమిత్తం మద్రాస్‌ హైకోర్టుకు ప్రతి ఏడాది ఒక్కరోజు మాత్రం మూసివేస్తారు. వేసవి సెలవుల్లోనూ స్పెషల్‌ బెంచ్‌ లను ఏర్పాటు చేసి, విచారణలు జరుపుతుంటారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యేక బెంచ్‌ లు ఏర్పాటవుతూ ఉంటాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments