Webdunia - Bharat's app for daily news and videos

Install App

శభాష్ అనిపించుకున్న పోలీస్ కానిస్టేబుల్.. ఏం చేశాడో తెలుసా? (video)

Webdunia
ఆదివారం, 11 ఆగస్టు 2019 (16:53 IST)
గుజరాత్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్‌ శభాష్ అనిపించుకున్నాడు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు చిన్నారులను కాపాడిన ఓ కానిస్టేబుల్‌‌కు దేశం యావత్తు సెల్యూట్ చేస్తోంది. గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, సైన్యం రంగంలోకి దిగి నిత్యం సహాయక చర్యలు చేపడుతున్నాయి. 
 
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద బాధిత ప్రాంతాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశారు. అలా ఓ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టిన పోలీసులకు.. ఓ చోట ఇద్దరు చిన్నారులు భయాందోళనలో కనిపించారు. ఎటు చూసినా కనుచూపుమేర వరదనీళ్లే కనపడుతున్నాయి. ఒడ్డుకు చేరే పరిస్థితే లేదు.
 
ఇంకా తీవ్ర భయాందోళనతో ఉన్నవారిని.. పృథ్విరాజ్ సింగ్ జడేజా అనే పోలీస్ కానిస్టేబుల్ తన భుజాలపైకి ఎత్తుకుని గట్టుకు చేర్చారు. ఆ ఇద్దరు చిన్నారులను కింద పడకుండా జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చిన ఘటనను అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రూపానీ దృష్టికి వెళ్లగా.. సదరు కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. వారి నిబద్ధతను అంతా అభినందించండంటూ సీఎం విజయ్‌ రూపానీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంకా వైరల్ అవుతున్న వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2: బాలకృష్ణ అఖండ 2 గురించి నందమూరి తేజస్విని అప్‌డేట్

Manoj: మంచు మనోజ్ ను హైలైట్ చేసిన మిరాయి ట్రైలర్

నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

Sumati Shatakam : ఫ్యామిలీ, లవ్ స్టోరీగా సుమతీ శతకం రాబోతోంది

Vishal: మూడు డిఫరెంట్ షేడ్స్‌లో విశాల్ మకుటం పోస్టర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments