Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌కు మరో దెబ్బ... 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది జంప్

Webdunia
గురువారం, 11 జులై 2019 (09:19 IST)
కాంగ్రెస్ పార్టీకి దెబ్బపై దెబ్బ తగులుతోంది. గోవా రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో 10 మంది పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా బీజేపీలో చేరారు. పైగా, తమను బీజేపీలో విలీనం చేసుకోవాల్సిందిగా వారు కోరగా, వెంటనే విలీన ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్  సావంత్ వెల్లడించారు. 
 
గోవా అసెంబ్లీలో మొత్తం 40 సీట్లు ఉండగా, ఇందులో బీజేపీకి 17 మంది, కాంగ్రెస్ పార్టీకి 15, గోవా ఫార్వార్డ్ పార్టీకి 3, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి 1, ఎన్సీపీకి 2, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది శాసనసభ్యుల్లో పది మంది బీజేపీలో చేరిపోయారు. దీంతో గోవాలో కాంగ్రెస్ పార్టీ బలం ఐదుకు పడిపోయింది. 
 
నిజానకి కర్నాటక సంక్షోభంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితుల్లో గోవాలో పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. పైగా, తమను బీజేపీలో విలీనం చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత చంద్రకాంత్‌ కవ్లేకర్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు స్పీకర్ రాజేశ్‌ పట్నేకర్‌ను కలిసి లేఖ ఇచ్చారు. మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు విలీనానికి సై అనడంతో కాంగ్రెస్  శాసనసభా పక్షం బీజేపీలో విలీనమైంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments