ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు.. భారీ నష్టం.. హెక్టార్ల భూమి కొట్టుకుపోయింది..

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:31 IST)
ఉత్తరాఖండ్‌లో మరోసారి ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. గత వారం వచ్చిన వరదల నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో ఉత్తరాఖండ్‌లోని తేహ్రీ ప్రాంతం వణికిపోయింది. వరదలకు పెద్ద ఎత్తున ఇళ్లు, దుకాణాలు ధ్వంసమయ్యాయి. 
 
రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి ఉత్తరాఖండ్‌ గజగజలాడుతోంది. తెహ్రీ జిల్లాలోని దేవ్‌ప్రయాగ్‌లో ఆకస్మికంగా కురిసిన వానలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది.
 
కోవిడ్ కర్ఫ్యూ కారణంగా దుకాణాలను మూసివేశారు. దీంతో ప్రాణ నష్టం జరగలేదు. ఉత్తరాఖండ్‌లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. కొండలపై వర్షం భారీగా పడుతోంది. తేహ్రీ దేవ్‌ప్రయాగ్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. 
 
ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి లొతట్లు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. వర్షం నీటికి లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లకు భారీగా నీరుతో పాటు బురద కూడా చేరుతోంది. వీరిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎస్‌డీఆర్‌ఎఫ్ జట్లను కూడా రంగంలోకి దించింది. 
 
గత వారం కురిసిన ఆకస్మిక వర్షాల కారణంగా ఘన్సాలీ, జఖానిధర్ బ్లాక్స్ చాలా నష్టపోయాయి. అనేక హెక్టార్ల భూమి కొట్టుకుపోగా.. అనేక వాహనాలను ఘన్సాలీ మార్కెట్లో శిథిలాల కింద పూడ్చిపెట్టుకుపోయాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments