Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ గేమ్ వ్యసనం : మమ్మీ సారీ అంటూ ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్

Webdunia
శనివారం, 31 జులై 2021 (14:28 IST)
ఆన్‌గైమ్ వ్యసనానికి లోనైన ఓ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ చిన్నారి ఆరో తరగతి చదువుతున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు మమ్మీ సారీ అంటూ ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చాత్తర్ పూర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాకు చెందిన 13 ఏళ్ళ కుర్రాడు ఆన్‌లైన్ గేమ్‌లో 40 వేల రూపాయలు నష్టపోయి తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలుడు పాథాలజీ ల్యాబ్ యజమాని కొడుకని తెలిసింది. 
 
ఎంతసేపూ ఫోన్ పట్టుకుని ఈ గేమ్ ఆడుతున్నావని, చదువుకోవాలని ఇతని తల్లి మందలించినట్టు తెలుస్తోంది. తల్లి మందలింపుతో బాటు తాను రూ.40 వేలు నష్టపోవడంతో ఆ మానసిక వేదన భరించలేక ఈ బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 
 
తన తల్లికి చెందిన యూపీఐ అకౌంటు నుంచి ఈ కుర్రాడు ఈ డబ్బు విత్ డ్రా చేసి ‘ఫ్రీ ఫైర్ గేమ్’ అనే ఆన్‌లైన్ ఆట ఆడి నష్టపోయాడు. తనను క్షమించాలని, ఈ గేమ్‌లో ఈ డబ్బు లాస్ అయ్యాయని యితడు తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
 
ఈ బాలుడు తల్లి ఆరోగ్య శాఖలో పని చేసేదని, తల్లీ తండ్రీ ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ అఘాయిత్యానికి దిగాడని పోలీసులు తెలిపారు. గత జనవరిలో కూడా ఇదే రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో 12 ఏళ్ళ బాలుడు ఈ ఆన్ లైన్ గేమ్‌కి బానిస కావడంతో తండ్రి మందలించి ఫోన్ లాక్కున్నాడని, దాంతో తన ప్రాణం తీసుకున్నాడు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments