Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థిని మందలించింది.. తుపాకీతో ప్రిన్సిపాల్‌ను కాల్చేశాడు..

విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా యమునా నగర్, తాపేర్ కాలనీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి త

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (17:57 IST)
విద్యార్థిని మందలించిన పాపానికి ఆ ప్రిన్సిపాల్ హత్యకు గురైంది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా యమునా నగర్, తాపేర్ కాలనీలోని స్వామి వివేకానంద కాలేజీలో 12వ తరగతి విద్యార్థి తమ మహిళా ప్రిన్సిపాల్‌ రితా చబ్రాను తుపాకీతో కాల్చి చంపేశాడు. ప్రిన్సిపాల్ ఆఫీసులో వుండగా.. అక్కడికెళ్లిన విద్యార్థి ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. 
 
కాలేజీకి వచ్చేటప్పుడే విద్యార్థి వెంట తుపాకీ తెచ్చుకున్నాడు. ప్రిన్సిపాల్‌ను హతమార్చిన విద్యార్థి తనంతట తానుగా పోలీసుల ముందు లొంగిపోయాడు. రితా చబ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా విద్యార్థి చేతికి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments