మమ్మల్ని బాత్రూంలోకి చొరబడి కొట్టారంటూ విద్యార్థునుల ఆరోపణ

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (11:48 IST)
పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదుట నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆందోళనలు హింసకు దారితీసి.. పలు బస్సుల్ని తగలబెట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఆపై పోలీసులు వర్సిటీలోకి చొరబడి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కాగా అమ్మాయిలు అని కూడా చూడకుండా బాత్రూంల లోనికి చొరబడి తమను కొట్టారంటూ విద్యార్థునులు ఆరోపిస్తున్నారు. మరోవైపు బస్సులను తగలబెట్టింది విద్యార్థులేనంటూ ఆరోపిస్తున్నారు. దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. 
 
అయితే ఢిల్లీలోని జామియా యూనివర్సిటీలో అల్లర్లపై దాఖలైన అత్యవసర పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు నిరాకరించింది. న్యాయవాదులు ఇందిరా జైసింగ్, కొలిన్ గొన్‌సాల్వెస్ టాప్ కోర్టు జడ్జిలను వర్సిటీకి పంపించి విచారణ జరిపించాలని కోరగా.. దీనిపై రేపు విచారణ చేపడుతామని స్పష్టం చేసింది. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన సమస్య అని, వర్సిటీలో ముందు శాంతియుత వాతావరణం నెలకొనాలని పేర్కొంది.  
 
శాంతియుత నిరసనలకు తాము వ్యతిరేకం కాదని తెలిపింది. 'మొదట అల్లర్లకు ఫుల్ స్టాప్ పడాలి. అల్లర్లు ఎలా చెలరేగుతాయో మాకు బాగా తెలుసు. ఇలాంటి వాతావరణంలో ఈ పిటిషన్‌పై విచారణ జరపలేం. ముందు అల్లర్లను ఆపండి.' అని ధర్మాసనం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments