Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరా భారత్ మహాన్... జనాభాలో మనదే అగ్రస్థానం

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (10:05 IST)
మేరా భారత్ మహాన్ అని భారత్ మరోమారు నిరూపించింది. జనాభానాలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. డ్రాగన్ కంట్రీ చైనాను అధికమించింది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో అత్యధిక జనభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 
 
చైనాలో జననాల రేటు ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 ఆఖరు నాటికి భారత్ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా అంటే ఈ నెల 18వ తేదీ 2023 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్టు అంచనా వేసింది. 
 
మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ మాత్రం భారత్‌లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే ఇటీవల చైనా ప్రకటించిన జనాభా గణాంకాల కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్టయింది.
 
మరోవైపు, 2022 నవంబర 15వ తేదీన పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండగా, అది 48 యేళ్లో అది రెట్టింపయింది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్ధాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments