Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేరా భారత్ మహాన్... జనాభాలో మనదే అగ్రస్థానం

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (10:05 IST)
మేరా భారత్ మహాన్ అని భారత్ మరోమారు నిరూపించింది. జనాభానాలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకుంది. డ్రాగన్ కంట్రీ చైనాను అధికమించింది. ఫలితంగా ప్రపంచ దేశాల్లో అత్యధిక జనభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని పలు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 
 
చైనాలో జననాల రేటు ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 ఆఖరు నాటికి భారత్ జనాభా 141.7 కోట్లు కాగా, తాజాగా అంటే ఈ నెల 18వ తేదీ 2023 నాటికి ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకున్నట్టు అంచనా వేసింది. 
 
మరో అంతర్జాతీయ మార్కెట్ పరిశోధక సంస్థ మాక్రోట్రెండ్స్ మాత్రం భారత్‌లో ప్రస్తుత జనాభా 142.8 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే ఇటీవల చైనా ప్రకటించిన జనాభా గణాంకాల కంటే ఇది ఎక్కువ అని తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్టయింది.
 
మరోవైపు, 2022 నవంబర 15వ తేదీన పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండగా, అది 48 యేళ్లో అది రెట్టింపయింది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన పురోగతి వల్ల అకాల మరణాలు తగ్గడం, ఆయుర్ధాయం పెరగడం జనాభా పెరుగుదలకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments