పెళ్లిమండపానికి మెట్రో రైల్లో వెళ్లిన వధువు.. ఎందుకో తెలుసా?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (09:51 IST)
దేశంలో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాంటి నగరాల్లో బెంగుళూరు ఒకటి. ప్రతి రోజూ ఈ నగర వాసులకు ట్రాఫిక్ పగటిపూటే చుక్కలు చూపిస్తుంది. తాజాగా ఓ వధువుకు కూడా వింత అనుభవం ఎదురైంది. కళ్యాణ మండపానికి ఇంటి నుంచి కారులో బయలుదేరిన వధువుకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. దీంతో ఆమె మధ్యలోనే కారు దిగి మెట్రో రైలు ఎక్కారు. 
 
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండటంతో ముహూర్త సమయానికి పెళ్లి మండపానికి చేరుకోలేనని భావించిన ఆ వధువు.. పెళ్ళి కుమార్తె ముస్తాబులోనే మెట్రో రైలు ఎక్కిసింది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రైలెక్కిన ఆమెను చూసిన ఇతర ప్రయాణికులు నోరెళ్లబెట్టారు. 
 
అయితే, నెటిజన్లు మాత్రం వధువు సమయస్పూర్తిని కొనియాడుతున్నారు. స్మార్ట్ పెళ్ళికూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆమెను ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం ముహూర్త సమయానికే బయలుదేరడం ఏంటి.. కాస్త ముందుగా బయలుదేరవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముహూర్త సమయాని ఆ వధువు మండపానికి చేరుకుని పెళ్లిపీటలపై కూర్చొని మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

Hreem: షూటింగ్‌ పూర్తి చేసుకున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం హ్రీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సంగారెడ్డిలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌ను మరింత విస్తరించటానికి చేతులు కలిపిన గ్రాన్యూల్స్ ఇండియా, సెర్ప్

వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?

పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments