Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కర్ణాటక రైల్వే స్టేషన్‌లో అలా.. ముంబై మెట్రో స్టేషన్‌లో ఇలా..? ఏం జరిగింది?

train
, మంగళవారం, 3 జనవరి 2023 (22:39 IST)
నిర్లక్ష్యం కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఓ మహిళను కారు డ్రైవర్ ఈడ్చుకెళ్లిన ఘటన గురించి తెలిసిందే. తాజాగా కర్ణాటకలోని కలబురగి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. మహిళను రక్షించిన వెంటనే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 
 
రైలు కదులుతున్న సమయంలో మహిళ ఎక్కేందుకు ప్రయత్నించింది. ప్లాట్‌ఫారమ్‌, రైలు మధ్య మహిళ కాలు తప్పి జారిపోయింది. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే స్పందించారు. రైలును ఆపాలని సూచనలు చేశారు. అనంతరం ఆ మహిళను రక్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
 
అయితే ముంబైలో మరో భయానక ఘటన చోటుచేసుకుంది. ముంబై మెట్రో వన్ రైలులో తాళం వేసి ఉన్న డోర్‌లలో ఓ మహిళ దుస్తులు ఇరుక్కుపోయాయి. రైలు కదులుతుండటంతో ఆ మహిళ అలా రైలు ప్లాట్‌ఫారమ్ చివరకు ఈడ్చుకెళ్లింది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో ఒక వ్యక్తి ఆమెను రక్షించడానికి ప్రయత్నించడం కూడా చూడవచ్చు, కానీ అతను విఫలమయ్యాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనంతరం సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. లోకో పైలట్‌ నిర్లక్ష్యమే కారణమని ప్రజలు ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ ఆమెకు చికిత్స అందించేందుకు మెట్రో అధికారులు ముందుకొచ్చారు. దీంతో ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందని పోలీసులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజలీ సింగ్‌పై అత్యాచారం జరగలేదు.. శవపరీక్షలో తేలింది..