Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊపిరి ఆగిపోయిన రెండేళ్ళ చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు...

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2023 (08:56 IST)
విమాన ప్రయాణ సమయంలో ఊపిరి ఆగిపోయిన స్థితిలో ఉన్న రెండేళ్ల చిన్నారికి వైద్యులు ప్రాణంపోశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు నుంచి ఢిల్లీకి విస్తారా సంస్థకు చెందిన విమానం యూకే 814 ఆదివారం బయలుదేరింది. ఈ విమానంలో గుండె సమస్యతో బాధపడుతున్న రెండేళ్ల చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం బెంగుళూరు నుంచి ఢిల్లీకి తీసుకెళుతున్నారు. ఈ విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు గాల్లోకి ఎగిరిన తర్వాత 30 నిమిషాలకే చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. 
 
ఒక్కసారిగా పాప ఊపిరి తీసుకోవడం ఆపేసింది. పెదాలు, వేళ్లు నీలిరంగులోకి మారిపోయాయి. నాడి కొట్టుకోవడం నిలిచిపోయింది. విమానాన్ని అత్యవసరంగా నాగ్‌పూర్ వైపు మళ్లించారు. ఓ సదస్సుకు వెళ్లి అదే విమానంలో తిరిగి వస్తున్న ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన నలుగురు వైద్యుల బృందం చిన్నారి పరిస్థితిని గమనించారు. వారికి ఐఎల్బీఎస్ ఆసుపత్రికి చెందిన వైద్యుడు జతకలిశారు. 
 
వీరంతా కలిసి చిన్నారి ఊపిరి తీసుకొనేందుకు వీలుగా శ్వాసనాళాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీపీఆర్ చేయడంతో తిరిగి ఊపిరి పీల్చుకుంది. 45 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి ప్రథమ చికిత్స ద్వారా పాపను రక్షించారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. విమానంలో జరిగిన ఈ ఘటనతోపాటు చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి ఎయిమ్స్ ట్విటర్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి చిత్రంపై విమర్శలకు నాగ్ అశ్విన్ మైండ్ బ్లోయింగ్ స్టేట్ మెంట్ !

శనివారాల్లో వైలెంట్ గా వుండే సూర్య కథే సరిపోదా శనివారం !

క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్ ల భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈసారి హైద‌రాబాద్‌లో

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments