Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం మూడు వేలకు కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు.. గర్భవతి కావడంతో..?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:49 IST)
కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటుచేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువకుడికి రూ. 3 వేలకు అమ్మేశాడు. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇంట్లో పని చేయించుకునేందుకని చెప్పి ఆ బాలికను యువకుడు తీసుకెళ్లాడు.
 
కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్రమంలో బాధితురాలు కొన్ని నెలల క్రితం గర్భం ధరించింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆమెతో డబ్బు లేకపోవడంతో వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించింది. కో
 
విడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమెను ఎవరూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెలలో బాధితురాలిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్‌పూర్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
 
తనకు జరిగిన ఘోర అవమానాన్ని సఖి కేంద్ర నిర్వాహకులకు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం తన అమ్మ చనిపోయినప్పుడు.. తనను ఓ యువకుడికి మూడువేలకు కన్నతండ్రి అమ్మేశాడని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

Tammareddy: ఉమెన్ సెంట్రిక్ గా సాగే ఈ సినిమా బాగుంది : తమ్మారెడ్డి భరద్వాజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం