మావోయిస్టుల ఘాతుకం.. 10 మంది పోలీసుల మృతి

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:48 IST)
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు పెట్రేగిపోయారు. ఈ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. దీంతో పది మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేలుడు జరిపడంతో ఈ దారుణం జరిగింది. పోలీస్ వాహనం డ్రైవర్‌తో పాటు పది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
 
దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో బుధవారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసుల వాహనం సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకున్న మావోలు.. ఆ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. దీంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఒక పౌరుడు కూడా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments