Webdunia - Bharat's app for daily news and videos

Install App

మావోయిస్టుల ఘాతుకం.. 10 మంది పోలీసుల మృతి

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (15:48 IST)
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోమారు పెట్రేగిపోయారు. ఈ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసుల వాహనాన్ని పేల్చేశారు. దీంతో పది మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేలుడు జరిపడంతో ఈ దారుణం జరిగింది. పోలీస్ వాహనం డ్రైవర్‌తో పాటు పది మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
 
దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో బుధవారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని తిరిగి వస్తుండగా నక్సల్స్‌ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసుల వాహనం సమాచారాన్ని ఇన్ఫార్మర్ల ద్వారా తెలుసుకున్న మావోలు.. ఆ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేల్చేశారు. దీంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఒక పౌరుడు కూడా ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments