Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయి మత్తులో కిరాతకం... హత్య చేసి శవంతో సెల్ఫీ.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:24 IST)
ఓ వ్యక్తి గంజాయి మత్తులో అత్యంత కిరాతక చర్యకు పాల్పడ్డాడు. ఓ యువకుడిని హత్య చేసి.. శవంతో సెల్ఫీ దిగాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని ఆదంబాక్కంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పరంగిమలై ఆదంబాక్కం పోలీసు స్టేషన్‌ వెనుకవైపు రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి సేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. 
 
దీంతో పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఓ చోట మట్టి తవ్వి ఉండటాన్ని గుర్తించారు. దీంతో అక్కడకు వెళ్లి మట్టిని తొలగించి చూడగా ఒక యువకుని శవం తీవ్ర గాయాలతో, ముఖం చిద్రమైన స్థితిలో ఉండటాన్ని గమనించారు. 
 
దీంతో ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా చేయించారు. ఆ తర్వాత దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఆ ముగ్గురు యువకుల్లోని ఒకడు కలైంజర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ఆనంద్‌‌గా గుర్తించారు. అతను అజ్ఞాతంలోకి వెళ్లగా.. అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు ఆనంద్‌ గంజాయి మత్తులో ఒక యువకుడిని చంపి, అతని శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్‌ గ్రూపులో పెట్టాడని వెల్లడించాడు. దీంతో వారిపై హత్య కేసు నమోదు చేశారు. మరోవైపు, పరారీలో ఆనంద్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments