ప్రశాంత్‌ కిశోర్‌పై చీటింగ్ కేసు నమోదు

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:26 IST)
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై ఓ యువకుడు కేసు పెట్టాడు. బీహార్‌లో తాను “బాత్‌ బీహార్‌ కీ” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవలే ప్రకటన చేశారు.

అయితే తన ఐడియాను కాపీ కొట్టి ప్రశాంత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టారు.

“బాత్‌ బీహార్‌ కీ” కార్యక్రమం తన ఆలోచన అని… ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా ప్రశాంత్‌ కిశోర్‌కు చెప్పాడని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఇప్పటికే తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు.

ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఒసామాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments