Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో అల్లర్లు.. ఒకేరోజు 8మంది మృతి.. 35కి చేరిన మృతుల సంఖ్య

Advertiesment
Delhi
, గురువారం, 27 ఫిబ్రవరి 2020 (16:02 IST)
ఢిల్లీలో అల్లర్లు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఢిల్లీ అల్లర్లతో మరణించిన వారి సంఖ్య సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం ఒకేరోజు 8మంది మృతిచెందడంతో మృతులసంఖ్య 35కి చేరింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో బీభత్స పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన వాహనాలు దర్శనమిస్తున్నాయి. 
 
భారీగా ఇటుకలు, రాళ్లు, కూల్ డ్రింక్ సీసాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించడంతోపాటు.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు అమలు చేయడంతో.. అల్లర్లు, ఆందోళనలు తగ్గాయి. దీంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇకపోతే.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు చేపట్టారు. ఆందోళనల్లో నడిరోడ్లపై ఆహుతైన వాటిని తొలగిస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియా యాప్స్ పైన కేసు నమోదు