Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..

నిర్భయ దోషులు ఉరిశిక్ష తప్పించుకోవడానికే ఇదంతా చేస్తున్నారు..
, ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:09 IST)
నిర్భయ దోషులు ఉరిశిక్ష నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు దోషులు వేస్తున్న ఎత్తుగడలు అధికమవుతున్నాయని ఆశాదేవి తెలిపారు. ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు పవన్‌ గుప్తా, వినయ్ కుమార్‌ శర్మ, అక్షయ్ కుమార్‌, ముఖేష్‌ కుమార్‌ సింగ్‌లకు మార్చి3న ఉదయం 6 గంటలకు ఉరి తీయబోతున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో వినయ్ తలను గోడకు కొట్టుకున్నాడు. దీంతో వీరి ఉరి అమలుపై మరోసారి సందిగ్ధత ఏర్పడింది. అయితే, తనకు వైద్య చికిత్స అందించాలంటూ వినయ్‌ కుమార్‌ వేసిన పిటిషన్‌ను ఢిల్లీలోని పటియాలా కోర్టు కొట్టి వేసింది.
 
ఈ నేపథ్యంలో నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఉరి శిక్ష అమలును జాప్యం చేసేందుకు వేస్తున్న ఎత్తుగడలు ఇవని.. న్యాయస్థానాన్ని దోషులు తప్పుదోవ పట్టిస్తున్నారు. దోషులు ముందున్న అన్ని న్యాయపర అవకాశాలు ముగిశాయి. మార్చి 3న వారికి ఉరి శిక్ష పడుతుందని కాను నమ్ముతున్నానని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్‌కు చుక్కలు చూపించిన తెలంగాణ వ్యక్తి..