Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ దోషులకు ఉరి.. మరోమారు డెత్ వారెంట్ జారీ

నిర్భయ దోషులకు ఉరి.. మరోమారు డెత్ వారెంట్ జారీ
, సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (16:46 IST)
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు వచ్చే నెల మూడో తేదీన ఉరిశిక్షలను అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు డెత్ వారెంట్‌ను జారీచేసింది. మార్చి 3వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌కు నిర్భ‌య నిందితుల‌ను ఉరి తీయాల‌ని ఆ వారెంట్‌లో కోర్టు ఆదేశించింది. ఈ న‌లుగురు నిందితులకు డెత్ వారెంట్ జారీ చేయ‌డం ఇది మూడ‌వ‌సారి. 
 
నిందితుల క్ష‌మాభిక్ష పిటిష‌న్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కార‌ణంగా.. గ‌త రెండు వారెంట్లు ర‌ద్దు అయ్యాయి. ఈ సారైనా నిందితుల‌కు ఉరిశిక్ష ప‌డుతుంద‌ని నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి ఆశాభావం వ్య‌క్తంచేసింది. పటియాలా హౌజ్ కోర్టులోని అడిష‌న‌ల్ సెష‌న్ జ‌డ్జి ధ‌ర్మేంద‌ర్ రాణా.. తాజా డెత్ వారెంట్ జారీ చేశారు. 
 
కాగా, న్యాయ వ్యవస్థలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ నలుగురు ముద్దాయిలు తమకు విధించిన ఉరిశిక్షలు అమలుకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా నలుగురు ముద్దాయిలు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయిస్తూ, ఉరిశిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగు భాష అమృతతుల్యం : వెంకయ్య నాయుడు