వేరొకరితో రొమాన్స్.. ప్రియురాలిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (22:42 IST)
తన ప్రియురాలు వేరొకరితో డేటింగ్ చేస్తోందని తెలిసి ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని గోర్బా జిల్లాకు చెందిన తను గుర్రే రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది. అలాగే బలంగీర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సచిన్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. ఈ కేసులో నవంబర్ 21న తనూ కుర్రె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
చాలా చోట్ల వెతికినా తనూ కుర్రె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి తనూ కుర్రె కోసం వెతికారు.
 
స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు అందిన సమాచారం ఆధారంగా ఒడిశాలోని బలంగీర్‌లో కాలిపోయిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
తీవ్ర విచారణ అనంతరం కాలి బూడిదైన మహిళ తనూ గుర్రే అని తేలింది. ఆపై ఒడిశా పోలీసులు సచిన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ప్రేమాయణం నడపటంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు విచారణలో సచిన్ అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments