Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీల కొరత.. వరి నాట్లు వేసిన ఛత్తీస్ గఢ్ మహిళా ఎంపీ

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:20 IST)
కొందరు రాజకీయ నాయకులు సామాజిక సేవలు చేస్తూ ఫోటోలకు ఫోజిస్తారు. కానీ ఓ మహిళా ఎంపీ నిజమైన నాయకురాలు అనిపించుకుంది. కూలీల కొరత ఉండటంతోనే స్వయంగా పొలానికి వెళ్లి వరి నాటేశారు. 
 
ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూలో దేవీ నీతమ్.. వరి నాటేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సొంత గ్రామమైన కొండగావ్‌లో వరినాట్లు వేసేందుకు కూలీల కొరత ఉందని ఎంపీకి తెలిసింది. దీంతో ఆమెనే నేరుగా పంట పొలానికి వెళ్లి వరి నాటేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీ నీతమ్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని వెల్లడించారు. కోవిడ్ కారణంగా కూలీల కొరత ఉందని తెలిసింది. సొంతంగా పంట వేసుకోవడం మంచిదే కదా అని.. తానే నాటేసేందుకు వచ్చానని చెప్పారు. తనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి రెండు, మూడు సార్లు వచ్చాను. పంట పొలానికి రావడంతో ఎంతో హాయిగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments