2021 మొదట్లోనే చంద్రయాన్‌-3 ప్రయోగం.. జితేంద్ర సింగ్

Webdunia
సోమవారం, 7 సెప్టెంబరు 2020 (13:31 IST)
Jitendra Singh
చంద్రయాన్‌-2ను 2019 జూలై 22న ప్రయోగించారు. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కుప్పకూలింది. కానీ ఆర్బిటార్ మాత్రం డేటాను పంపిస్తూనే వుంది. మరోవైపు 2008లో ప్రయోగించిన చంద్రయాన్‌-1 పంపిన ఫోటోలు తాజాగా ఓ కొత్త విషయాన్ని తేల్చాయి. చంద్రుడి ద్రువాలు తుప్పుపట్టిపోతున్నట్లు ఆ ఫోటోలు వెల్లడించాయి. నాసా శాస్త్రవేత్తలు కూడా దీన్ని ద్రువీకరించారు.
 
కాగా.. చంద్రయాన్‌-2ను 2019లో ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. వాస్తవానికి చంద్రయాన్‌-3ని 2020లో లాంచ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల ఆ ప్లాన్‌ కాస్త జాప్యం అయ్యింది. లాక్‌డౌన్ వల్ల చంద్రయాన్‌-3 ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడిపైకి చంద్రయాన్-3 మిషన్‌ను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష శాఖకు చెందిన సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్-2తో పోలిస్తే చంద్రయాన్‌-3 భిన్నంగా ఉంటుందన్నారు. చంద్రయాన్‌-3లో ఆర్బిటర్ ఉండదన్నారు. కానీ ఆ ప్రాజెక్టులో ల్యాండర్‌, రోవర్ ఉన్నాయన్నారు. 2021 మొదట్లోనే చంద్రయాన్‌-3ను ప్రయోగించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments