Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాబిల్లికి మరింత చేరువైన 'చంద్రయాన్-3' : కక్ష్యను కుదించిన ఇస్రో శాస్త్రవేత్తలు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (09:07 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం ఇప్పటివరకు సాఫీగానే సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా, జాబిల్లికి చంద్రయాన్-3 మరింత చేరువైంది. ఆదివారం రాత్రి కక్ష్య కుదింపు చర్యను చేపట్టినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో జాబిల్లికి చంద్రయాన్ మరింత దగ్గరైందని, ఇదేవిధంగా కక్ష్య కుదింపు చర్యలు మరో రెండు ఉన్నాయని వారు వెల్లడించారు. అన్నీ సవ్యంగా సాగితే ఈ నెల 23వ తేదీన చంద్రయాన్-3 వ్యోమనౌక జాబిల్లిపై దిగుతుందని వారు తెలిపారు.
 
కాగా, ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 1.00 నుంచి 2.00 గంటల మధ్య చంద్రయాన్-3 జాబిల్లికి మరింత దగ్గరయ్యేలా మరో చిన్న కక్ష్యలోకి ప్రవేశపెడతామని వారు తెలిపారు. ఆ తర్వాత రెండు సార్లు కక్ష్య మార్పు కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఆఖరులో చంద్రుడికి 100 కిలోమీటర్ల ఎత్తున ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి చంద్రయాన్-3ని చేర్చుతారు. 
 
ఆ పిమ్మట ఈ నెల 23వ తేదీన చంద్రుడిపై దించుతారు. చంద్రయాన్-3 వ్యోమనౌకను గత నెల నెలలో శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ప్రయోగించిన విషయం తెల్సిందే. తొలుత భూమి చుట్టూ పరిభ్రమిస్తూ వేగం పుంజుకున్న వ్యోమనౌక శనివారం జాబిల్లి కక్ష్యలోకి తొలిసారిగా ప్రవేశించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments