Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త చనిపోయిన మహిళతో ప్రేమాయణం.. పెళ్లి మాటెత్తగానే ట్యాంకర్ కింద తోసి చంపేసిన ప్రియుడు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (08:58 IST)
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో వాటర్ ట్యాంకర్‌ ఢీకొట్టి చనిపోయిన ప్రమీల అనే మహిళ మృతి కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ప్రేమించిన యువకుడే ఆమెను ట్యాంకర్ కింద తోసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం నెమలిగుట తండాకు చెందిన భుక్తా ప్రమీల అనే యువతి కొన్నేళ్ల క్రితం నగరానికి వలస వచ్చింది. గత యేడాది ఆమెకు వివాహం కాగా ఏప్రిల్ నెలలో ఆమె భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె బాచుపల్లిలోని ఓ స్టీలు దుకాణంలో పనిచేస్తూ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ జీవనం సాగిస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ప్రమీల సొంతూరుకు చెందిన భూక్యా తిరుపతి నాయక్‌తో ప్రమీలకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. భర్తను కోల్పోయిన ప్రమీల.. తిరుపతికి దగ్గరైంది. అయితే, అతడు ఇటీవల ప్రమీలను మోసం చేసి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రమీల తనను పెళ్లి చేసుకోవాలని, లేకపోతే, ఇంట్లో చెబుతానంటూ ఒత్తిడి చేయసాగింది. 
 
ఇదే విషయంపై చర్చించేందుకు ఆదివారం కలుద్దామని ప్రమీల తిరుపతితో చెప్పింది. ఈ క్రమలో తిరుపతి మరో స్నేహితుడితో ద్విచక్రవాహనంపై బాచుపల్లి రహదారి వద్ద ఉన్న ఆమె వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య మరోమారు వాదోపవాదాలు జరగడంతో క్షణికావేశానికి లోనైన తిరుపతి... సరిగ్గా అటువైపు వస్తున్న ట్యాంకర్ లారీ కింద తోసేశాడు. దీంతో ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ప్రమీల ప్రమాదవశాత్తు మణించిందని నమ్మించే ప్రయత్నించిన తిరుపతి.. చివరకు పోలీసుల తమదైనశైలిలో ప్రశ్నించడంతో తిరుపతి నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అంకిత్ కొయ్య, నీలఖి ల కెమిస్ట్రీ, స్కూటీ చుట్టూ తిరిగే బ్యూటీ గా లవ్ సాంగ్‌

Rehman: ఏఆర్ రహ్మాన్ బాణీలతో రామ్ చరణ్ పెద్ది ఫస్ట్ సింగిల్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments