Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 30 మంది మృతి.. వందమందికి గాయాలు

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2023 (08:54 IST)
Train
పాకిస్థాన్‌లో సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో 30 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో ఆదివారం నాడు ప్యాసింజర్ రైలులోని కనీసం పది బోగీలు పట్టాలు తప్పడంతో కనీసం 30 మంది ప్రయాణికులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారని అధికారులు ప్రకటించారు. 
 
ప్రాణనష్టాన్ని ధృవీకరిస్తూ, సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా మాట్లాడుతూ, తొమ్మిది కార్లను క్లియర్ చేశామని, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం దక్షిణ ఓడరేవు నగరమైన కరాచీకి తరలించినట్లు వెల్లడించారు.
 
దాదాపు 16 నుండి 17 బోగీలతో 1,000 మంది ప్రయాణికులు ఉన్న హజారా ఎక్స్‌ప్రెస్ రైలు, కరాచీ నుండి దేశంలోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లే మార్గంలో కాలువ వంతెనను దాటుతుండగా ట్రాక్‌పై నుండి పక్కకు తప్పుకుంది. దీంతో ఈ ఘోరం జరిగిపోయిందని రైల్వే శాఖ మంత్రి ఖవాజా సాద్ రఫీక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 
 
ఇంకా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, రెస్క్యూ టీమ్‌లు, పాకిస్థాన్ ఆర్మీ, పాకిస్థాన్ రైల్వే సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని వెల్లడించారు. స్థానిక వాలంటీర్లు కూడా బోగీల కింద చిక్కుకుపోయిన ప్రయాణికులను రక్షించడంలో సహాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments