Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (11:43 IST)
ఇప్పటికే గడ్డి కుంభకోణం కేసులో జైలుశిక్షను అనిభవిస్తున్న ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారంటూ లాలూ, ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీరా భారతితో పాటు లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. అదేసమయంలో ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 
 
గత యూపీఏ 1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖామంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన రైల్వేలో ఉద్యోగాలు ఇప్పినందుకుగాను లాలూ, ఆయన కుటుంబ సభ్యులు భూములు, ఆస్తుల రూపంలో లంచాలు స్వీకరించారని వీరిపై అభియోగాలు మోపారు. 
 
దీంతో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలోని ఆయన నివాసంతో పాటు 15 చోట్ల ఏకకాలంలో సోదాలకు దిగారు. పాట్నాలో సీబీఐ అధికారులు సోదాలు చేసే సమయంలో కేవలం రబ్రీదేవి ఒక్కరే ఉన్నారు. లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లు ఇంట్లో లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments