Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇంట్లో పాములే పాములు.. పరుగులు తీసిన జనం

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (11:41 IST)
యూపీలోని ముజాఫర్ నగర్ ఖతౌలీ నగర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. అశోక్ విహార్ ఆవాస్ వికాస్ కాలనీలోని కడ్లి గ్రామానికి చెందిన రంజిత్ సింగ్ ఇంటి నంబర్ ఇ-218 ఉంది. ఈ క్రమంలో నరేష్‌పాల్‌ కుటుంబానికి ఇంటిని అద్దెకు ఇచ్చారు. 
 
మే 8వ తేదీన వాషింగ్ మెషీన్ దగ్గర పాములు సంచరిస్తున్నట్లు నరేష్‌పాల్ భార్య గమనించింది. ఈ క్రమంలో ఆమెకు మరికొన్ని పాములు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని ఇంటి యజమానికి చెప్పింది. దీంతోపాటు ఇంటిని ఖాళీ సైతం చేశారు. ఆ తర్వాత యజమాని పాములు ఎక్కడ ఉన్నాయో వెతకడం మొదలుపెట్టాడు.
 
ఈ క్రమంలో బుధవారం కూలీలను పెట్టి పాములను వెతుకుతూ.. బాత్‌రూమ్‌, టాయిలెట్‌ ఫ్లోర్‌లను తొలగించారు. దాని కింద దాదాపు 60 పాములు నక్కి ఉన్నాయి. దీంతోపాటు 75 గుడ్లు కూడా లభించాయి. పాములు ఒక్కసారిగా పరుగులు తీయడంతో.. కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
 
సమాచారం మేరకు పాములను పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ వచ్చి.. గంటల కొద్ది శ్రమించి పాములను సీసాలలో బంధించి తీసుకెళ్ళాడు. దీంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బుల్లి సినిమాలు గురించి మేధావులు ఆలోచించండి : రామ సత్యనారాయణ

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజేంద్ర ప్రసాద్ నటించిన నేనెవరు?

మెగాస్టార్ చిరంజీవి చిత్రాల అప్ డేట్స్ ఒకవైపు - కార్మికుల సమస్యలకు మరోవైపు?

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments