Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదు : కేంద్రం స్పష్టం

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (10:10 IST)
కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరికాదని సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని చెప్పింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విధించిన కోవిడ్ నిబంధనల్లో బలవంతపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎక్కడా లేదని గుర్తుచేసింది.
 
అంగవైకల్యంతో బాధపడుతున్నవారు టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడం కష్టతరమని, అందువల్ల వారికి వారి ఇంటివద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ స్వచ్చంధ సంస్థ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకపోతే వారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. 
 
దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌ను సమర్పించింది. బలవంతంగా ఎవరికీ వ్యాక్సిన్ వేయించలేమని ఆ అఫిడవిట్‌లో కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధన లేదని తేల్చి చెప్పింది.
 
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని మాత్రమే కేంద్రం చెబుతుందని, దీనికి సంబంధించి మీడియా, సోషల్ మీడియా ఫ్లాట్‌‍ఫామ్స్‌ల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చామని చెప్పింది. ఏ ఒక్కరికీ వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఒత్తిడి చేయలేమని తెలిపింది. వ్యాక్సిన్ వేయించుకోవాలనేది వారి వ్యక్తిగత అంశమని స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments