Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (11:57 IST)
కర్నాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా మంగోలిలోని ఓ కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు. మొత్తం 59 కేజీల తాకట్టు బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
 
విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రజలు బ్యాంకు రుణాల కోసం తాకట్టు పెట్టిన బంగారం చోరీకి గురైనట్లు విజయపుర ఎస్పీ లక్ష్మణ్ బి.నింబార్గి మీడియాకు తెలిపారు. 
 
మే 26న కెనరా బ్యాంకు మేనేజర్ దీనిపై ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. మే 23న సాయంత్రం బ్యాంకు సిబ్బంది తాళం వేసి వెళ్లారని, ఆ తర్వాత రెండు రోజులు నాలుగో శనివారం, ఆదివారం సెలవు కావడంతో బ్యాంకు మూసి ఉందన్నారు. మే 26న బ్యాంకు గుమాస్తా వచ్చి శుభ్రం చేసేందుకు తెరవగా షట్టర్ తాళం కట్ చేసి ఉండటాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారన్నారు.
 
ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడినట్లు వెల్లడైందని, మొత్తంగా 59 కిలోల బంగారం చోరీకి గురైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుని ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments