Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటక రాష్ట్రంలో చోరీకి గురైన ఆర్టీసీ బస్సు..

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2023 (10:02 IST)
కర్నాటక రాష్ట్రంలో ఒక ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. రాష్ట్రంలోని కలబురిగి జిల్లా చించోలి బస్టాండులో జరిగింది. ఇక్కడ పార్కింగ్ చేసివున్న కేఏ38 ఎఫ్971 అనే నంబరు కలిగిన ఈ బస్సు బీదర్ రెండో డిపోకు చెందినదిగా గుర్తించారు. ఇది ప్రతి రోజూ చించోలి - బీదర్ ప్రాంతాల మధ్య తిరుగుతుంది.
 
ఈ బస్సును గుర్తు తెలియని వ్యక్తి ఒకరు వచ్చి ఈ బస్సును అపహరించాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మంగళవారం వేకువజామున 3.30 గంటల సమయంలో బస్టాండులోకి వచ్చిన ఓ అగంతకుడు ఈ బస్సను చాకచక్యంగా అపహరించాడు. ఇదంతా బస్టాండులోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. 
 
ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చోరీకి గురైన బస్సు కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే, ఈ బస్సు తెలంగాణాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆ బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఈ బస్సును అపహరించిన దొంగలు.. తెలంగాణాలోని తాండూరు మీదుగా తీసుకెళ్ళినట్టు గుర్తించారు. అయితే, ఈ బస్సును డిపార్ట్‌మెంట్ వారే అపహరించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments