Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో బుల్లెట్ రైలు... 14న శంకుస్థాపన

భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నా

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (06:27 IST)
భారత్‌లో బుల్లెట్ రైలు పరుగు పెట్టనుంది. ఇందుకోసం సెప్టెంబరు 14వ తేదీన శుంకుస్థాపన చేయనున్నారు. దేశంలో తొలి బుల్లెట్ రైలు ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య నడుపనున్నారు. అయితే, ఈ బుల్లెట్ రైలు ప్రయాణం 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ఈ రైలు గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లనుంది. దీనిద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌(508 కి.మీ)కు రెండు గంటల్లో చేరుకోవచ్చు. 
 
కాగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం సెప్టెంబరు 14వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ రైల్వే స్టేషన్‌ సమీపంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జపాన్ ప్రధాని షింజో అబే కూడా పాల్గొననున్నారు. సుమారు రూ.98,000 కోట్ల వ్యయంతో చేపడుతున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు వ్యయంలో 81 శాతాన్ని జపాన్‌ రుణంగా సమకూర్చనుంది. 
 
ఈ కార్యక్రమంలో భాగంగా ఇరుదేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు శంకుస్థాపన కోసం సెప్టెంబర్‌ 13న గుజరాత్‌కు మోడీ, అబేలు చేరుకుంటారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments