Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుద్ధుని బోధనలు ప్రపంచ సమస్యలకు పరిష్కారం : ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (16:55 IST)
ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు బుద్ధుని బోధనలు పరిష్కారం చూపుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ బౌద్ధ శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. బుద్ధుడు చూపిన బాటలోనే భారతదేశం పయనిస్తుందన్నారు. అందులోభాగంగానే, అనేక దేశాలకు భారత్ సాయం చేస్తుందన్నారు. 
 
ఇటీవల, టర్కీతో సహా భూకంప ప్రభావిత దేశాలకు భారతదేశం సహాయం చేసిందని గుర్తుచేశారు. భారతదేశం ప్రతి మనిషి బాధను తన సొంత బాధగా పరిగణిస్తుందని చెప్పారు. ప్రజలు, దేశాలు వారి స్వంత ప్రయోజనాలపై ఆసక్తి కలిగి ఉండాలని, ప్రపంచ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. 
 
పేద, వనరులు లేని దేశాల గురించి ప్రపంచం ఆలోచించాలని కోరారు. బుద్ధుని ఆలోచనలను వ్యాప్తి చేయడంతోపాటు గుజరాత్‌తో పాటు తన సొంత నియోజకవర్గమైన వారణాసితో తనకున్న సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నా ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోందని చెప్పారు. 
 
"సమకాలీన సవాళ్లకు పరిష్కారాలు: ఆచరణ దిశగా తత్వశాస్త్రం" అనే అంశంపై అంతర్జాతీయ బౌద్ధ సదస్సు గురు, శుక్రవారాల్లో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంది. అంతర్జాతీయ బౌద్ధ సమాఖ్య సహకారంతో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments